-అభ్యర్థుల తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలి జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీపీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించగా, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ బి.ఎస్. లత జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుండి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్...