తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆదివారం నుంచి జరగబోవు జాతరకు నూతన బారికేడ్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శనివారం ప్రారంభించారు. ఈ బారికేడ్లను వెంకటగిరి దుకాణదారులు అందచేసినట్లు వెల్లడించారు. క్యూలైన్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వీటిని ఉపయోగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఐ ఏవి రమణ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.