Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: ప్రజల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Ibrahimpatnam, Rangareddy | Sep 13, 2025
షాద్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 1116,500 విలువచేసే చెక్కులను శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆరోగ్య రక్షణను తమ కర్తవ్యం గా భావిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us