కూకట్పల్లిలో మహిళా హత్య కేసుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. చేతులు కట్టేసిన చంపేయడం ఏంటన్నారు. ఇటీవల చిన్నపిల్లను చంపేయడం బాధించిందన్నారు. సిటీలో లా అండ్ ఆర్డర్ తప్పిందని ఎమ్మెల్యే ఆరోపించారు. హంతకులకు తగిన బుద్ధి చెప్పాలని పోలీసులకు సూచించారు. తమ ప్రభుత్వంలో సిటీ ఇమేజ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నేరాలను చూసి హైదరాబాద్కు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.