సోషల్ మీడియా పోస్టింగుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని రాజోలు సీఐ నరేష్ కుమార్ సూచించారు. రాజోలులో ఆయన కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో ఉన్నా సరే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామన్నారు. గల్ఫ్ దేశాలలో ఉండి తమకేమి కాదు అనే భ్రమలో ఉండొద్దన్నారు. లుక్ అవుట్ నోటీస్ ద్వారా ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్టు చేస్తామన్నారు.