నంద్యాల జిల్లా అవుకు మండలంలోని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారి కలిమునిసా గురువారం మీడియా తెలిపారు. సెప్టెంబర్ 2 లేదా 3 తేదీల్లో మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రైతులు అవసరమైన మేరకే యూరియాను వినియోగించాలని, ముందస్తు నిల్వల కోసం అధిక మొత్తంలో కొనుగోలు చేయరాదని సూచించారు.