ఉమ్మడి జైనథ్ మండలంలోని నూతన బోరజ్ మండలంలో గల తర్నం వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మించక ముందే ఉన్న పాత బ్రిడ్జిని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూల్చి వేయించి ప్రజల రాకపోకలకు మరింత ఇబ్బందులకు గురి చేశారని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, జైనథ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. వాగు దాటలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ... తాత్కాలికంగా ప్రజల రాకపోకల కోసం 4 కోట్లతో నిర్మించిన లో లెవెల్ వంతెన సైతం తరుచూ చిన్నపాటి వర్షం వస్తే చాలు వరదల్లో మునిగిపోతోందన్నారు.