ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని నేత పాలెం పలు ప్రాంతాలలో డ్రైనేజీ సమస్యను కమిషనర్ నారాయణరెడ్డి పరిష్కరించే చర్యలను చేపట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు డ్రైనేజీ కాలవలతో ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ నారాయణరెడ్డి అన్నారు.