మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో ప్రతిష్టించిన గణనాథుడికి ఎమ్మెల్యే ఆరి కె పూడి గాంధీ శనివారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తీర్థప్రసాదాలను స్వీకరించారు. సిద్ధి బుద్ధి జ్ఞానం ప్రసాదించే గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నియమ నిష్టలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.