పట్టణంలో ఇటీ వల చోరీలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రొద్దుటూరు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ఏ కారణం లేకుండా అను మానాస్పదంగా తిరుగుతున్న వారిని స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు పట్టణంలో అనుమా నాస్పదంగా సంచరిస్తుండగా ప్రొద్దుటూరు రూరల్ స్టేషను తీసుకొచ్చారు. విచారణలో భాగంగా అతను కర్ణాటక వాసిగా గుర్తించారు. వేలి ముద్రలను తీసుకున్న తర్వాత ఎస్ఐ-2 గదిలో ఉంచారు. బుధవారం వేకువ జామున స్టేషన్లో ఉన్న అతను ఎస్ఐ గదిలోని రూ.14వేల నగదుతో పాటు బయట పెట్రోల్ బంకు వద్ద ఉన్న బ్లూకోల్ట్స్ బైక్ తీసుకొని పరారయ్యాడు.