Download Now Banner

This browser does not support the video element.

సాంబారు టబ్‌లో పడిన చెముడుగూడ గ్రామానికి చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి

Parvathipuram, Parvathipuram Manyam | Jan 1, 2025
పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం చముడుగూడలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గత నెల 29 న జరిగిన కంది కొత్తల ఉత్సవాలలో సాంబార్ టబ్ లో రమేష్ అనే గిరిజన యువకుడు జారిపడ్డాడు. 3 రోజుల పాటు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతుని భార్య నిండు గర్భిణీ అవ్వడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నూతన సంవత్సరంతో చముడుగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us