ఏలూరులోని 33 వ డివిజన్ చిట్టివలస పాకల ప్రాంతంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. లబ్ధిదారులకు అధికారులు, కూటమి నాయకులతో కలిసి వారి వద్దకు వెళ్లి స్వయంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వైసిపి పార్టీ చేసే దుష్ప్రచారులను ప్రజలు నమ్మే పరిస్థితులు లేదని, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.