కోడూరు మండలం నరకనపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను అవనిగడ్డ సీఐ యువకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో, మతసామరస్యంతో నిర్వహించుకోవాలని, ఎవరినీ కించపరిచే పాటలు పెట్టవద్దని కమిటీ సభ్యులకు సూచించారు. కృష్ణా నది వద్ద నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.