రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా గద్వాల మండలం,జిల్లెడ బండ తండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణపు పనులకు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలసి శంకుస్థాపన చేశారు.శుక్రవారం ఉదయం పనుల జాతర-2025 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గత సంవత్సరం 13 కోట్ల రూపాయలతో గద్వాల నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు.