మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు రైతులను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో సిసిఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు రైతులను సిద్దం చేయాలని తెలిపారు. 2025-26 సంవత్సరానికి గాను పత్తి పంట కనీస మద్దతు ధరకు క్వింటాల్కు 8,110 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు.