Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యం గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడమే అని పార్వతీపురం సబ్ కలెక్టర్ డాక్టర్ ఆర్.వైశాలి అన్నారు. శనివారం పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేశారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతో భాగస్వాములు కావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వ్యక్తిగత, సామాజిక బాధ్యత అవసరమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రోగాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.