Download Now Banner

This browser does not support the video element.

జమ్మలమడుగు: వల్లూరు : జంగంపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ బోల్తా –డ్రైవర్‌కు గాయాలు

India | Sep 5, 2025
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని వల్లూరు మండలం జంగంపల్లి గ్రామ సమీపాన శుక్రవారం ఒక ఇసుకలోడు ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటన కలకలం రేపింది.స్థానికుల తెలిపిన సమాచారం ప్రకారం పైడికాలువ క్రాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కడపకు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్, అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడి వారే వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గల కారణాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us