Araku Valley, Alluri Sitharama Raju | Sep 12, 2025
అనంతగిరి మండలంలో చిట్టెంవలస వాగులో గురువారం ఓ ప్రమాదవశాత్తు గల్లంతయిన గిరిజనుడి మృతదేహం శుక్రవారం లభ్యమయింది.గుమ్మా పంచాయతీ పరిధి గ్రామాల్లో గురువారం సాయంత్రం భారీవర్షం కురిసింది. ఈ క్రమంలో వంజలవలసకి చెందిన దేముడు, బంధువును చిట్టంవలసకి దిగబెట్టేందుకు ఇద్దరు కలిసి వెళ్లారు. వాగును దాటించే క్రమంలో బంధువు వెళ్లిపోగా దేముడు గల్లంతై ఆచూకీ దొరకలేదు. శుక్రవారం మృతదేహం లభ్య మవగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అరకులో ఏరియా ఆసుపత్రికి తరలించారు