కూకట్పల్లిలో వేలకోట్లు విలువ చేసే 128 ఎకరాల ప్రభుత్వ భూమిని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఐడిఎల్ కంపెనీకి ఎకరం మీకే అప్పగించిందని బోడుప్పల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింతల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తర్వాత గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్మిందని తెలిపారు. ఈ అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.