సంగారెడ్డి జిల్లాలోని 1213 పాఠశాలలకు రూ.1.90 కోట్ల స్కూల్ గ్రాంట్ విడుదలైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మొదటి విడతగా 50% నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. నిధులు నేరుగా ప్రధానోపాధ్యాయుడు అమ్మ ఆదర్శ పాఠశాల సంయుక్త ఖాతాలో జమ చేస్తారని పేర్కొన్నారు. కమిటీ తీర్మానం మేరకు నిధులు ఖర్చు చేసుకోవాలని సూచించారు.