Download Now Banner

This browser does not support the video element.

కరీంనగర్: రాజీమార్గమే రాజమార్గము : కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్

Karimnagar, Karimnagar | Sep 13, 2025
రాజీమార్గమే రాజమార్గమని కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శివకుమార్ అన్నారు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణంలోని న్యాయ సేవాధికర సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ ను ప్రారంబించారు న్యాయమూర్తి శివకుమార్. ఈ లోక్ అదాలత్ కు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు,పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి శివకుమార్ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ ను నిర్వహిస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 20,500 పైగా కేసులు ఉన్నాయన్నారు. 2,200 కేసులను లోక్ అదాలత్ లో పరిష్కారానికి తీసుకొచ్చామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us