ములుగు మండలంలోని పలు సమస్యలపై భారతీయ జనతా పార్టీ నాయకులు నేడు సోమవారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం పత్రం అందజేశారు. గ్రామాల్లో ఎక్కడ వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వలన డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలుతున్నాయని, ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.