Download Now Banner

This browser does not support the video element.

జగన్ పర్యటన నేపథ్యంలో పొదిలిలో మహిళలు పోలీసులపై జరిగిన దాడులను ఖండించిన జిల్లా టిడిపి నేతలు

Ongole Urban, Prakasam | Jun 11, 2025
ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులను పరామర్శించేందుకు బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అమరావతి మహిళలపై సాక్షి టీవీ ఛానల్ డిబేట్లో చేసిన అనుచిత వ్యాఖ్యలకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ కూటమి పార్టీ మహిళలు ప్లకార్డులు నల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన చేస్తున్న మహిళలపై వైసీపీ శ్రేణులు రాళ్లు చెప్పులతో దాడులు చేశారు. ఇదే సమయంలో అక్కడున్న పోలీసులు లాఠీ చార్జి చేసి ఇరువర్గాలను తరిమివేసి గొడవను అదుపు చేశారు..ఈ ఘటనను ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us