అనంతపురం నగర శివారులోని రాంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు కు చెందిన నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.