ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ గ్రేడింగ్ (పాసింగ్ విధానం)ను నిలిపి వేయడంతో, హమాలీలు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేయడంతో, మంగళవారం ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ డైరెక్టర్ కల్పన రైతులకు నష్టం కలిగించే ఈ విధానాన్ని వ్యాపారులు కొనసాగించరాదని పలుమార్లు హెచ్చరించామని చెప్పారు. అయితే పలువురుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. వేరుశనగను శుభ్రపరచి మార్కెట్కు తీసుకొస్తే మంచి ధర లభిస్తుందని సూచించారు.