Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
ఆరుగాలం కష్టపడే రైతుకు అష్ట కష్టాలు తప్పడం లేదు. ఒక వైపు పంటలు సాగు చేయడానికి ప్రకృతి సహకరించక, కావలిసిన ఎరువుల మందులు లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం తాడిచెర్ల ప్రాథమిక సహకార కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుండే మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు కార్యాలయం వద్దకు చేరుకొని యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ఎండ ఉండడంతో చెప్పులను క్యూ లైన్ లో పెట్టి యూరియా బస్తాల కోసం రైతులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రైతులకు సరిపడా యూరియా ను సరఫరా చేయాలని కోరుతున్నారు.