పెడన ఫ్లైఓవర్ వద్ద ద్విచక్ర వాహనదారుడుని ఢీ. కొట్టిన RTC బస్సు స్తానిక పెడన ఫ్లైఓవర్ వద్ద శనివారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. బొర్రపోతుపాలెం నుంచి పెట్రోల్ బంక్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు నాగార్జునను, గుడివాడ టూ ఏలూరు నుంచి మచిలీపట్నం వెళ్తున్న RTC బస్సు ఢీ.కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నాగార్జునను స్థానికులు 108 అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.