సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్టపై వినాయక నిమజ్జనం ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్తయ్య గౌడ్, ఎస్ బీ ఎస్సై కిరణ్ కూడా పాల్గొన్నారు