Download Now Banner

This browser does not support the video element.

ఓఎన్టీసీ కార్యకలాపాల వల్ల గోదావరిలో పులసలు వలస వెళ్తున్నాయంటూ గోగన్నమఠంలో మత్స్యకారుల ఆందోళన

Mamidikuduru, Konaseema | Aug 26, 2025
మామిడికుదురు మండలం గోగన్నమఠంలో ONGC వైఖరిని నిరసిస్తూ మత్స్యకారులు మంగళవారం ధర్నా చేశారు. ఆ సంస్థ కార్యకలాపాల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి వరదల సీజన్లో దొరికే అరుదైన పులసలు దొరకటం లేదని వాపోయారు. ONGC కార్యకలాపాల వల్లే పులసలు వలస వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. పులసల వేట లేక తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us