తెలుగుదేశం పార్టీకి బీసీ లు వెన్న ముక్కలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కర్నూలు నగరంలోని అంబెడ్కర్ భవన్ లో నిర్వహించిన రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. కార్యక్రమంలో భాగంగా చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రజక విద్యార్థులకు ఎంపీ ప్రతిభా పురస్కారాలు అందజేశారు... ఈ సందర్బంగా ఆదోనిలో రజక కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం సహాయం అందించాలని రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ఎంపీ నాగరాజు ను కోరగా, దీని పై స్పందించిన ఆయన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.15 లక్షలు కేటాయించారు