అద్దంకి మండలం బొమ్మనంపాడు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్టిలోడుతో వెళుతున్న ట్రిప్పర్ లారీ అదుపుతప్పి సైడ్ కాలువలో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు.