హెల్మెట్ ధరించి వాహనదారులు ప్రమాదాల నివారణకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ నిత్య బాబు విజ్ఞప్తి చేశారు. శనివారం మధ్యాహo ఆయన మీడియాకు వెల్లడిస్తూ సత్తార్ భావి వద్ద ఇద్దరు సితమ్స్ కళాశాలలో చదువుతున్న యువకులు హెల్మెట్ ⁸ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలన్నారు. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు చిన్నచిన్న గాయాలతో బయటపడవచ్చునని తెలిపారు. కారులో వెళ్లేవాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. అలా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తామన్నారు