అక్రమంగా గంజాయి అమ్ముతున్న వ్యక్తిని బుధవారం సాయంత్రం వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. వాంకిడి SI మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి గ్రామానికి చెందిన చంద్ర శేఖర్ ఎండు గంజాయి విక్రయిస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ సిబ్బందితో తనిఖీలు చేయగా అతని వద్ద 140 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది. గంజాయి స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.