తాబేల్లు పట్టడానికి వెళ్లి నీట మునిగిన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. కురవి మండలం నల్లెల గ్రామ శివారు గనేష్ కుంటలో వెంకన్న అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం తాబేల్లు పట్టడానికి వెళ్లి నీట మునిగి గల్లంతయ్యాడు సోమవారం సాయంత్రం వరకు గాలించినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం గాంధీ ఈతగాల్లతో గాలించగా మృతదేహం లభ్యమయింది. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.