ఆంధ్ర, ఒడిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గరియాబంద్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఆపరేషన్లో తెలంగాణకు చెందిన సెంట్రల్ కమిటీ సభ్యుడు మోడెం బాల్కృష్ణ@భాస్కర్ మరణించినట్లు సమాచారం. ఇతని తలపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. ఈ ఎదురుకాల్పులను గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు.