నల్లగొండ జిల్లా: నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గణేష్ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవసరమని జిల్లా ప్రజలు సుభిక్షంగా కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా వినాయకుడు అందరిని ఆశీర్వదించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు.