కాకినాడజిల్లా తుని పట్టణ మార్కెట్ యార్డ్ చినుకు పడితే చిత్తడే అన్న మాదిరిగా దర్శనమిస్తుంది. 40 గ్రామాల నుంచి ఉదయాన్నే హోల్సేల్గా కూరగాయలు కొనుక్కునేందుకు అమ్మేందుకు సైతం పలువురు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు..అయితే చెరువు మాదిరిగా ఆ ప్రాంతం దర్శనం ఇవ్వడంతో రైతులు కొనుగోలుదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. సంబంధించిన యంత్రాంగం స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు