యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో భర్తలను కోల్పోయిన వితంతువులు ఆసరా పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం దినదినం గండంగా బతుకుతున్నామని షుగర్ బిపి గోలీలకు చేయి చాపాల్సి వస్తుందన్నారు. ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే ఎంపీలు అధికారులైన కలెక్టర్ తహసిల్దార్లు స్పందించి కనీసం ఆసరా పెన్షన్ అయినా ఇప్పించాలన్నారు.