మొగల్తూరులో పూరి గుడిసెలో కొనసాగుతున్న శ్రీనడివీధి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం మంటల్లో దగ్ధమైంది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి పూజలు చేసేందుకు వచ్చిన భక్తులు ఈఘటనను చూసి ఆవేదనకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారికి ఆలయానికి నిప్పంటించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై చర్యలు చేపట్టాలంటూ భక్తులు కోరుతున్నారు