దాచేపల్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అద్దంకి-నార్కెట్పల్లి రహదారిపై బైకుపై వెళ్తున్న నారాయణపురంకి చెందిన సుకుమార్ (22)ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. హోటల్లో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.