మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో తోడే రవళి అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.