ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జి పై ఓ టిప్పర్ సైడ్ రైలింగ్ ను ఢీ కొట్టింది. దీంతో టిప్పర్ గాల్లో వేలాడింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని స్థానికులు తెలిపారు.