తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో నాగ చైతన్య వేరువేరుగా గురువారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయం వద్దకు చేరుకున్న వాళ్లకు అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తులు వారితో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.