పార్వతీపురం మండలం జిల్లా కురుపాం ఎక్సైజ్ స్టేషన్ ను గురువారం ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పైడి రామచంద్రరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాజశేఖర్ తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులపై ఆరా తీశారు. నాట్ సారా తయారీ కేంద్రాలు, అమ్మకందారులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కేసు నమోదు అయిన వారిపై పిడి కేసులు బనాయించాలని ఆదేశించారు.