రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రేపు మంగళవారం సెప్టెంబర్ 2 వతేదీన కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా సోమవారం తెలిసిన వివరాల మేరకు కమలాపురం శాసనసభ్యులు చైతన్య రెడ్డి , జమ్మలమడుగు నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై పలు అంశాలను చర్చించి, ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.