ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం సాయంత్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఈవిఎం లను భద్రపరిచిన గోదామును త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాము సీలు తెరిచి గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల బాక్సులను పరిశీలించడం జరిగిందని తెలిపారు.