శ్రమజీవుల శంఖారావం పేరుతో ఈనెల 23 నుండి 25 వరకు ఒంగోలులో జరగనున్న సిపిఐ 28 వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. శుక్రవారం రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి మహాసభలకు వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.