జిల్లా పరిషత్ పరిధిలోని జడ్పీటీసీలకు, ఎంపీపీలకు గత కొన్ని నెలలుగా గౌరవ వేతనాలు అందలేదని చక్రాయపేట మండల జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. జడ్పీటీసీ, ఎంపీపీ లకు రావాల్సిన గౌరవ వేతనాలు తక్షణమే విడుదల అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.