సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిపోను ఆర్టిసి ఎండి సజ్జనర్ ఆకస్మికంగా సందర్శించారు. ఆదివారం రాత్రి సందర్శించిన ఎండి డిపోలో తిరిగి పరిశీలించారు. ఉద్యోగులు సిబ్బంది తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ స్వామి, అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది, కార్మికులు ఉన్నారు.