నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోందని ఆదివారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు.ఇన్ ఫ్లోగా ప్రాజెక్టు లోకి 5121 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు ఒక్క గేట్ ఎత్తి అవుట్ ప్లోగా 6796 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు 4.699 టీఎంసీలు కాగ ప్రస్తుత నీటి మట్టం 698.325 అడుగులు 4.281 టీఎంసీలలో ప్రాజెక్టు నీటి సామర్థ్యం కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు కోరారు.